మంగళసూత్రాన్ని తెంపుకెళ్లిన దుండగలు

19 Jun, 2016 18:40 IST|Sakshi

బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని తెంపుకుపోయారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన లక్ష్మమ్మ (51) ఆదివారం ఉదయం నడుచుకుంటూ వెళుతుండగా... వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమె మెడలో ఉన్న మూడు తులాల మంగళ సూత్రాన్ని తెంపుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు