దుర్గమ్మను దర్శించుకున్న చైనా బృందం

18 Dec, 2016 22:52 IST|Sakshi
దుర్గమ్మను దర్శించుకున్న చైనా బృందం

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లను చైనా బృందం సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళవాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. అనంతరం మల్లేశ్వరాలయం , చండీయాగం విశేషాలు, అమ్మవారి ప్రసాదాల గురించి చైనా బృందానికి ఈవో సూర్యకుమారి వివరించారు. చైనా బృందం అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశీలిస్తుండటంపై భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.

>
మరిన్ని వార్తలు