ఎయిమ్స్‌లో సత్తా చాటిన చందనా దీప్తి

24 Jul, 2016 01:10 IST|Sakshi
ఎయిమ్స్‌లో సత్తా చాటిన చందనా దీప్తి
న్యూశాయంపేట : జాతీయ స్థాయి మెడికల్‌ ప్రవేశ పరీక్షలో హన్మకొండకు చెందిన రాపోలు చందనాదీప్తి 37వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. ఈ మేరకు ఆమె ఎయిమ్స్‌ భూపాల్‌లో సీటు సంపాదించింది. చందనా దీప్తి నగరంలోని తేజస్వీ పాఠశాలలో పదో తరగతి, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో కార్డియాలజిస్టును అవుతానని ఆమె పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు