'కేంద్రానికి లేఖ అంటూ బాబు హడావుడి'

2 Apr, 2016 12:04 IST|Sakshi

విజయవాడ: కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలపై పోరాటం చేస్తారేమోనని భావించి.. నిధులపై కేంద్రానికి లేఖ అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు