ఎస్‌కేయూ క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా చంద్రమోహన్‌

1 Jan, 2017 23:34 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఈ నెల 3 నుంచి జరిగే సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్శిటీ క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే ఎస్‌కే యూనివర్శిటీ జట్టుకు మేనేజర్‌గా నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ పీడీ చంద్రమోహన్‌ ఎంపికయ్యారు. ఎస్‌కేయూ జట్టు ఈ నెల 3 నుంచి 11 వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే క్రికెట్‌ టోర్నీలో పాల్గొననుంది. తనను మేనేజర్‌గా నియమించినందుకు ఎస్‌కేయూ వీసీ, రిజిస్ట్రార్, స్పోర్ట్స్‌ కార్యదర్శి జెస్సీ, తన కళాశాల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు