తండ్రీ కొడుకులు దోచేస్తున్నారు

27 Dec, 2016 21:22 IST|Sakshi
  • చంద్రబాబు విధానాలపై ధ్వజమెత్తిన జక్కంపూడి, జగ్గిరెడ్డి 
  • ర్యాలి (ఆత్రేయపురం): 
    2014 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఎన్నో హమీలు ఇచ్చి గద్దెనెక్కారని 32 నెలల కాలంలో ఒక్క హమీని అమలు చేయకుండా రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దోచుకుతింటున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్‌ జక్కంపూడి రాజా, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం గడపగడపకూ వైఎస్సార్‌లో భాగంగా ఆత్రేయపురం మండల పరిధిలోని ర్యాలిలో వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఒక పథకం ప్రకారం పచ్చనేతలు దోచుకుతింటున్నారని విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ నిధులు అందించకుండా పార్టీ ఇ¯ŒSచార్జిలకు అందించి పనులు కమీషన్లకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలన ఏకపక్షంగా నిర్వహిస్తూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో నిరుద్యోగులకు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు అందించి ఆదుకోగా నేడు ఆ ఉద్యోగాలను చంద్రబాబు తొలగించి నిరుద్యోగుల పొట్ట కొట్టారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం , రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, నిరుద్యోగ భృతి వంటి సుమారు 650 వాగ్దానాలు గుప్పించగా ఒక్కటీ నెరవేర్చలేదని, దీంతో చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి పెద్దఎత్తున ఉద్యమం చేపడుతున్నారని పేర్కొన్నారు. జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి చేపడుతున్న యువభేరి, గడపగడపకూ వైఎస్సార్‌ వంటి కార్యక్రమాలను తెలుగుదేశం కాపీ కొట్టి యువగర్జన, జన చైతన్యయాత్రలు నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి సభలకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ సభల నిర్వహణకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఈ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. కొత్తపేట నియోజకవర్గంలో గడపగడపకూ వైఎస్సార్‌కు ప్రజలు ఆదరణ చూపిస్తున్నారన్నారు. ఇక్కడ ఇద్దరు నేతలు అధికారం కోసం కొట్టుకుంటున్నారని తద్వారా అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ఎంపీపీ కోట చెల్లయ్య,  పార్టీ రాష్ట్ర మహిళా  కార్యదర్శి బొక్కా వెంకటలక్ష్మి పాల్గొన్నారు. 
     
>
మరిన్ని వార్తలు