హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు గురువారం ఆయనను కలిసి సందర్భంలో తన అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలిసింది. 'రాష్ట్ర పరిస్థితి బాగాలేదు అయినా..కేంద్రం ఆశించిన స్థాయిలో సాయం చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు నన్ను అర్థం చేసుకుని కొన్ని త్యాగాలు చేయాల్సిందే.
జూన్ తర్వాత ఉద్యోగులంతా విజయవాడకు రావాలి. ఇప్పటికిప్పుడు శాశ్వత బస ఏర్పాటు సాధ్యం కాదు. తాత్కాలిక బస ఏర్పాటు చేస్తాం' అని ఉద్యోగులకు చంద్రబాబు తెలిపారు. కాగా తమ కార్యాలయాలన్ని ఒకేచోట ఉండాలని, అలాగే ఇళ్లు కట్టుకునేందుకు తమకు స్థలాలు కేటాయించాలని సచివాలయ ఉద్యోగులు అంతకు ముందు చంద్రబాబును కోరారు.