చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదు: కేఈ

20 Feb, 2016 18:20 IST|Sakshi
చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదు: కేఈ

విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి (నంద్యాల) కుటుంబం టీడీపీలో చేరే అంశంపై అసలు ఇంతవరకు తమ పార్టీలో ఎవరికీ స్పష్టత లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ అంశంపై అసలు చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. భూమాను చేర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదని కేఈ అన్నారు.

శిల్పా మోహన్‌ రెడ్డి సోదరులు భూమా నాగిరెడ్డి రాకను సీఎం చంద్రబాబు నాయుడు వద్ద వ్యతిరేకించారని, అయితే చంద్రబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని చెప్పారు.

మరిన్ని వార్తలు