రైల్వేస్టేషన్‌లో పుష్కర పనులు పరిశీలన

7 Aug, 2016 20:05 IST|Sakshi
పనులు పరిశీలిస్తున్న డీఆర్‌ఎం మాల్యా
మాగనూర్‌ : మండల పరిధిలోని కష్ణా రైల్వేస్టేషన్‌లో పుష్కరాల నిమిత్తం రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్న తాత్కాలిక షెడ్లు, మరుగుదొడ్లు తదితర పనులను డీఆర్‌ఎం మాల్యా ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా ఇన్, ఆవుట్‌ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా పుష్కరాల సమయానికి స్టేషన్లలో అన్ని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. పరిశీలించిన వారిలో స్టేషన్‌ మేనేజర్‌ కేవీకే రెడ్డి, మాగనూర్‌ ఎస్‌ఐ నర్సయ్య, హెడ్‌కానిస్టేబుల్స్‌ రాఘవరెడ్డి, మహేష్‌ తదితరులు ఉన్నారు.
 
>
మరిన్ని వార్తలు