- పట్టుబడ్ల స్మగ్లర్లు
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా)
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇద్దరు స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 792 గ్రాముల బంగారాన్ని, సుమారు రూ.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు దోహ నుంచి ఖతార్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్కు బ్యాగ్లో పెట్టుకుని వస్తుండగా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.