మాచారెడ్డిలో చిరుతల కలకలం

31 Jul, 2016 10:33 IST|Sakshi

మాచారెడ్డి (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు పది చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించడంతో.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని అన్నారం, అక్కాపూర్, ఇసాయిపేట, మద్దికుంట, రెడ్డిపేట ప్రాంతాల్లో చిరుతలు సంచిరిస్తున్నాయని సమాచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు