చికిత్స పొందుతూ బాలిక మృతి

23 Sep, 2016 22:48 IST|Sakshi

చిలమత్తూరు : ఆత్మహత్యకు పాల్పడిన బాలిక బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది. వివరాలు.. మండల కేంద్రంలోని బ్రాహ్మణవీధికి చెందిన రోషన్, షకీలా దంపతుల పెద్ద కుమార్తె హర్షియాబాను (13) స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పి భరించలేక సోమవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకుంది.

గమనించిన బంధువులు, తల్లిదండ్రులు గాయపడ్డ హర్షియాను  హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా వివరించారు.

>
మరిన్ని వార్తలు