'త్వరలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది'

11 Jul, 2015 12:03 IST|Sakshi
'త్వరలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది'

తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ శనివారం తిరుపతిలో జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నిలకు మాత్రం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన ఓ ఒక్క హామీ అమలు చేయలేకపోయారని ఆరోపించారు.

నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజుపట్నం ఓడరేవు సాధన కోసం పోరాటం చేస్తానని చింతా మోహన్ తెలిపారు. అందుకోసం సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు చింతా మోహన్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు