మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య

18 Dec, 2015 00:50 IST|Sakshi
మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య

చిత్తూరు: చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి (46) గురువారం ఉదయం 11 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు.  చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, కఠారి మోహన్ దంపతుల హత్య కేసులో బుధవారం మధ్యాహ్నం పోలీసులు శివప్రసాద్ రెడ్డిని తీసుకెళ్లి విచారించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయనను వదిలిపెట్టారు.

అయితే, ఈ హత్యకేసులో అనవసరంగా తనను ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని భావించిన శివ ప్రసాద్ రెడ్డి మనోవేదనకు గురై ఇంటికి వస్తూనే గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 36వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి గెలిచారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తుంది.

మరిన్ని వార్తలు