►మూడు రోజుల పాటు పర్యటన
►రేపు పలు కార్యక్రమాలకు హాజరు
►ఎల్లుండి తిరుమల సందర్శన
చిత్తూరు కలెక్టరేట్: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న గురువారం ప్రకటించారు.
►శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సీఎం పుత్తూరులోని సిద్ధార్థ్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొంటారు.
►7.30 గంటలకు తనపల్లె క్రాస్ వద్ద రామానాయుడు కల్యాణమండపంలో జరిగే వివాహ వేడుకకు హాజరవుతారు.
► 8 గంటలకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే బస
►శనివారం ఉదయం 9.30 గంటలకు పులిచెర్ల మండలం అరవవాండ్లపల్లెలో పంట సంజీవని ఫాం ఫాండ్లను పరిశీలిస్తారు.
►10.35 గంటలకు రొంపిచెర్ల మండలం నగరి దళితవాడలో నిర్మించిన పక్కాగృహాలు, మరుగుదొడ్లు తదితరాలను పరిశీలిస్తారు. సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. 11.15 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
►మధ్యాహ్నం 3.30 గంటలకు ఎస్వీయూలోని లైబ్రరరీ బ్లాక్ వద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తారు.
►సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీనివాస ఆడిటోరియంలో నీరు – ప్రగతి శిక్షణలో పాల్గొంటారు.
► శ్రీపద్మావతి అతిథి గృహంలో రాత్రిబస
►ఆదివారం ఉదయం 11 గంటలకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు.
► 3.10 గంటలకు రేణిగుంట నుంచి విజయవాడకు బయలుదేరుతారు.