అతిథి గృహం సందర్శించిన భువనేశ్వరి

13 Aug, 2015 10:35 IST|Sakshi
అతిథి గృహం సందర్శించిన భువనేశ్వరి

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం సిద్ధం అవుతున్న లింగమనేని అతిథి గృహాన్ని ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న సందర్శించారు.  బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడకు వచ్చిన ఆమె మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అక్కడే ఉండి అన్ని గదులను పరిశీలించారు. భువనేశ్వరి పర్యటన రహస్యంగా జరగడంతో స్థానిక అధికారులకు, నాయకులకు ఈ సమాచారం తెలియలేదు.

కాగా  తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్టపై ఏర్పాటు చేసుకోనున్న అధికారిక నివాసం వద్ద పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యంత గోప్యంగా  ఈ పనులు జరుగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు