ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహానికి హాజరైన సీఎం

25 Feb, 2016 00:59 IST|Sakshi
బాల్క సుమన్ సోదరి వివాహానికి హాజరైన కేసీఆర్ దంపతులు

మెట్‌పల్లి: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని వెంకట్‌రెడ్డి గార్డెన్స్‌లో బుధవారం జరిగిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి స్వర్ణ-శ్రీకాంత్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరై ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సీఎం తన సతీమణి శోభ, కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితతో కలసి మెట్‌పల్లి వచ్చారు.

ఈ వివాహానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్, ఎంపీలు వినోద్‌కుమార్, కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, సింగరేణి సీఎండీ శ్రీధర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.

 

మరిన్ని వార్తలు