మెదక్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి మిషన్ భగీరథకు పైపులైన్ ఏర్పాటు చేశారు. రైట్ ఆఫ్ వే చట్టం కింద ఫాంహౌస్ నుంచి పైపులైన్ వేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పైపులైన్ కోసం ఫాంహౌస్లో కొంతమేర అల్లం పంటను తొలగించినట్లు తెలిపారు. మిషన్ భగీరథకు అందరూ సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు.