ఫాంహౌస్ నుంచి రాజధానికి..

7 Jun, 2016 18:29 IST|Sakshi

జగదేవ్ పూర్ (మెదక్) : నాలుగు రోజులుగా మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోనే గడిపిన సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యారు. శుక్రవారం రాత్రి అక్కడకు వెళ్లి నాలుగు రోజులుగా వ్యవసాయక్షేత్రంలో ఖరీఫ్ పనులను పరిశీలించారు. ఏ పంటలను సాగు చేయాలో ఫాంహౌస్ ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మార్కుక్, పాములపర్తి, గౌరారం మీదుగా రోడ్డు మార్గాన కాన్వాయ్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ వారాంతంలో మళ్లీ ఆయన ఫాంహౌస్‌కు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు