మన్యంలో పెరిగిన చలి తీవ్రత

11 Nov, 2016 13:03 IST|Sakshi
మన్యంలో పెరిగిన చలి తీవ్రత

విశాఖ: మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో గురువారం రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. లంబసింగిలో 5 డిగ్రీలు, పోతురాజుగుడి సమీపంలో 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో మంచు దుప్పటి కప్పుకున్న విధంగా దట్టమైన పొగమంచు ఆవరించింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి పర్యాటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు