ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రజాసాధికార సర్వే ద్వారా 10.52 లక్షల మంది ప్రజల వివరాలను సేకరించామని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు రాష్ట్ర సీసీఎల్ అనిల్చంద్ర పునీత్కు తెలిపారు. ప్రజాసాధికారత సర్వే, ప్రభుత్వ ఫైల్స్ పరిష్కారం, భూమి కన్వర్షన్ ఛార్జీల వసూళ్లు, ఎల్ఈసీ కార్డుల జారీ తదితర అంశాలపై రాష్ట్ర భూపరిపాలన శాఖ కమిషనర్ అనిల్ చంద్రపునీత్ శుక్రవారం జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ కోటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్ సర్వేలో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.