పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

29 Mar, 2017 02:17 IST|Sakshi
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

దుగ్గొండి, చెన్నారావుపేట(నర్సంపేట): స్థానిక ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భం గా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పరీక్షా కేంద్రాల ఇన్‌చార్జిలకు సూచించా రు. ఎస్సై భాస్కర్‌రెడ్డి, పరీక్షా కేంద్రం సీఎస్‌లు సాల్మన్, రజాక్‌ పాల్గొన్నారు.

అలాగే, చెన్నారావు పేట మం డలంలోని అమీనాబాద్‌ మోడల్‌స్కూల్, సిద్ధార్థ హైస్కూల్, జెడ్పీ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఈఓ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈ లక్ష్మీనారాయణ, సీఎస్‌ కొమ్మాలు, సీసీ రవిచంద్ర, రవికుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు