అమరావతి వెళ్లిన కలెక్టర్‌

19 Sep, 2017 21:53 IST|Sakshi

అనంతపురం అర్బన్‌: రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి బుధ, గురువారం నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్‌ వీరపాండియన్‌ మంగళవారం బయలుదేరి వెళ్లారు. కాన్ఫరెన్స్‌కు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించి నివేదికను రెండు రోజుల క్రితమే  సిద్ధం చేసుకున్నారు. కాన్ఫరెన్స్‌ ముగిసిన తర్వాత కోర్టు పనిమీద హైదరాబాద్‌కు వెళ్తారు. తిరిగి ఈ నెల 23 విధులకు హాజరవుతారని అధికారవర్గాల ద్వారా సమాచారం. అప్పటి వరకు జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

మరిన్ని వార్తలు