ఘనంగా సామూహిక వివాహాలు

2 Oct, 2016 23:57 IST|Sakshi

హిందూపురం అర్బన్‌ : స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ధర్మశాలలో ఆదివారం పది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా నవ దంపతులకు పట్టు వస్త్రాలు, తాళి బొట్టు, కాలిమెట్టలు సమకూర్చి ఉచితంగా వివాహాలు చేశారు. కార్యక్రమానికి దంపతుల తల్లిదండ్రులు, బంధుగణం, సత్యసాయి సేవాద⌠æరాష్ట్ర కోఆర్డినేటర్‌ లాలాలజపతిరాయ్, జిల్లా ఇన్‌చార్జి కిరణ్‌కుమార్, ఎస్‌కే యూనివర్శిటీ డీన్, జిల్లా అధ్యక్షుడు రామాంజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చలం మాట్లాడుతూ కరుణమూర్తి సత్యసాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. అనంతరం నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించి భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు