సింధు రజితం గెలుపుపై హర్షం

22 Aug, 2016 00:25 IST|Sakshi
బిజినేపల్లి: రియో ఒలింపిక్‌ బ్యాట్మింటన్‌లో తెలుగు తేజం సింధు ఫైనల్‌లో రజితం పతకం సాధించడంపై పాలెం నేతాజీ యువజన సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాట్మింటన్‌లో ఫైనల్‌లో సింధు స్వర్ణ పతకం సాధించేందుకు ఎంతగానో కషి చేసినా ఫలితం దక్కకపోవడం బాధాకరమన్నారు. ఏది ఏమైనా  దేశంలో వ్యక్తిగత రజితం పతకం సింధు సాధించడం గొప్ప విషయమన్నారు. హర్షం ప్రకటించిన వారిలో శ్రీనివాస్‌గౌడ్,  సిరిజంగం శ్రీనివాసులు, శ్రీనివాస్, నాగరాజు, జ్ఞానేశ్వర్, కష్ణ, రేణుగౌడ్‌ ఉన్నారు. 
మరిన్ని వార్తలు