'కేసీఆర్కు, హరీష్కు మంత్రులు దాసోహం'

8 Sep, 2015 15:01 IST|Sakshi
'కేసీఆర్కు, హరీష్కు మంత్రులు దాసోహం'

సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మారుస్తోందని కాంగ్రెస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్ రావు, రామ్మోహన్ రెడ్డి తదితరులు ఆరోపించారు. మెదక్ వరకు వచ్చిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాకు ఎందుకురాదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాకు నీరు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా అభివృద్ధిపై చర్చకు మంత్రి హరీష్ రావు సిద్ధమేనా అంటూ సవాల్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మారిస్తే జాతీయహోదా జాప్యమవుతుందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన వెయ్యికోట్ల రూపాయల పనులు వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన మంత్రులు పదవుల కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు, మంత్రి హరీష రావుకు దాసోహమవుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

మరిన్ని వార్తలు