కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

24 Sep, 2016 21:56 IST|Sakshi
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
హజూర్‌నగర్‌ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ డివిజన్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు శనివారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ  దీక్షల్లో రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూలకంటి నర్సిరెడ్డి రిలే దీక్షలు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఆలోచించి అన్ని అర్హతలు కలిగిన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంకతి అప్పయ్య, ఎంబి.దేవదానం, చెన్నా సోమయ్య, హనుమంతరావు, పురుషోత్తం, రఘునాథం, రామ్మోహన్‌రావు, నారాయణరెడ్డి, కలకుంట్ల రామయ్య, మాణిక్యం, సత్యనారాయణ, నర్సయ్య, జాన్, వేముల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, సుధాకర్‌రెడ్డి, lంకయ్య, కాశయ్య, ధర్మూరి, అనంతరామశర్మ, ఎన్‌.వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు