జమ్మికుంటలో పత్తి ధర రూ. 4700

5 Oct, 2016 22:56 IST|Sakshi
జమ్మికుంటలో పత్తి ధర రూ. 4700
జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో బుధవారం క్వింటాల్‌ పత్తికి రూ. 4700 గరిష్ట ధర పలికింది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు 800 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. కనిష్ట ధర రూ.4500 చెల్లించగా.. మోడల్‌ ధర రూ.4600 నిర్ణయించారు. ఇద్దరు వ్యాపారులు మార్కెట్లో కొనుగోళ్లకు రావడంతో బీటైపు వ్యాపారులు ధరలు కొంత పెంచి కొనుగోళ్లు జరిపారు.  తేమ అధికంగా ఉన్న కొత్త పత్తికి రూ. 3200 నుంచి 3800 వరకు చెల్లించారు. నాణ్యమైన పత్తికి గరిష్ట ధర రూ. 4700 చెల్లించారు.
 
 
 
మరిన్ని వార్తలు