ఘాట్లలో హుండీల లెక్కింపు

25 Aug, 2016 00:55 IST|Sakshi
ఆత్మకూర్‌: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆత్మకూర్‌ మండల పరిధిలోని నందిమల్ల, మూలమల్ల, జూరాల గ్రామాల్లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను బుధవారం కురుమూర్తి దేవస్తానం ఈవో శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో లెక్కించారు. మూలమల్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.58,470లు, నందిమల్లలోని శ్రీ బ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం హుండీలో రూ.23,130లు, జూరాల గ్రామంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన హుండీలో రూ.24,097లు ఉన్నట్లు తెలిపారు. లెక్కింపులను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆలయ నిర్వాహకుల సమక్షంలో చేపట్టినట్లు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు