సిద్దిపేటలో ఓట్ల లెక్కింపు ప్రారంభం

11 Apr, 2016 11:13 IST|Sakshi

సిద్దిపేట జోన్: మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి స్థానిక ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. ఉదయం 11 గంటల లోపు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. మొత్తం 34 వార్డుల్లో 6 వార్డులు ఏకగ్రీవం అయినా విషయం తెలిసిందే.

స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 6న పోలింగ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల అధికారులు కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి దినకర్‌బాబు పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉంటే.. పోటీలోని అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా ఉండగా, అధికార పార్టీ టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్‌పై ఆశలు పెట్టుకుంది.

>
మరిన్ని వార్తలు