బుక్కరాయసముద్రం : స్థానిక గౌరయ్య కొట్టాలలో శాంతమ్మ, ఎర్రిస్వామి అనే దంపతులు బుధవారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. గౌరయ్య కొట్టాలలో నివాసముంటున్న ఓ వ్యక్తితో దంపతులకు స్థల వివాదం ఉందన్నారు. దీనిపై పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరగలేదన్న కారణంతో పైన పేర్కొన్న దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఈ చర్యకు యత్నించినట్లు స్థానికులు లె లిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.