అద్దెకు దిగి..ఇంటి యజమానికే టోకరా

28 Jun, 2016 08:37 IST|Sakshi
అద్దెకు దిగి..ఇంటి యజమానికే టోకరా

మేడ్చల్: రంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అద్దెకు ఉంటామంటూ వచ్చి ఆ ఇంటి యజమానికే భారీగా టోకరా వేసిన ఘటన మేడ్చల్ మండలం పూడూర్‌లో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి నెల క్రితం దంపతులు అద్దెకు దిగారు. ఇంటి యజమానితో నమ్మకంగా ఉంటూ సోమవారం రాత్రి అదను చూసుకుని అత్త, కోడలిపై మత్తుమందు ఇచ్చి నగలు, నగదుతో పరారయ్యారు. మంగళవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి, వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు