సోమందేపల్లి : ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్కు కొమ్ముకాస్తోందనీ, అందుకే ఆర్టీసీ నష్టాలబాటలో కూరుకుపోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విమర్శించారు. సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.