'ఆర్థిక అరాచకాలకు విజయవాడ అడ్డాగా మారింది'

13 Dec, 2015 17:58 IST|Sakshi

విజయవాడ: కాల్మనీ వ్యవహారంలో విచారణ జరుపుతున్న పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఉందని ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  ఆరోపించారు. ఆర్థిక అరాచకాలకు విజయవాడ అడ్డాగా మారిందన్న ఆయన.. కాల్మనీ వ్యవహారంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మహిళలకు న్యాయం జరగకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు