అమరుల త్యాగాలను మరవొద్దు: ఈటల

15 Aug, 2015 16:50 IST|Sakshi
అమరుల త్యాగాలను మరవొద్దు: ఈటల

కరీంనగర్ : దేశం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఎన్నటికీ మరువరాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో అమరవీరుల స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... గాంధీజీ చూపిన మార్గంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, పెద్దపల్లి నగర ఛైర్మన్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు