మొసలిని బంధించిన గ్రామస్తులు

12 Dec, 2016 14:28 IST|Sakshi

అడవిదేవులపల్లి(నల్లగొండ): నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామస్తులు మొసలిని పట్టుకుని బందీని చేశారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన మహిళలు సమీపంలోని కృష్ణా నదిలో దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. అయితే, నీటిలో ఉన్న ఓ మొసలి మహిళలపై దాడి చేసింది.

ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒడ్డుకు వచ్చిన మొసలి మెడకు ఉచ్చు వేసి బంధించారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, గ్రామస్తులపై మొసలి దాడి చేయటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి.

మరిన్ని వార్తలు