ధర్మపురిలో పుణ్యస్నానాలు

19 Aug, 2016 17:50 IST|Sakshi
ధర్మపురిలో పుణ్యస్నానాలు

ధర్మపురి : శ్రావణ శుక్రవారం సందర్భంగా ధర్మపురి గోదావరిలోని స్నానఘట్టాల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ∙ప్రాంతాల నుంచి ఇరవై వేలకుపైగా భక్తులు తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించారు. అనంతరం దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.

గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారం
ధర్మపురి గోదావరిలోని స్నానఘట్టాల వద్ద చెత్తాచెదారంతో అపరిశుభ్రత నెలకొంది. కొబ్బరిచిప్పలు, బట్టలు, వ్యర్థపదార్థాలను తొలగించేవారు లేక ఘాట్‌ వద్ద ఇలా దర్శనమిచ్చాయి.

మరిన్ని వార్తలు