ఛత్తీస్‌ఘడ్‌లో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

16 Aug, 2017 21:28 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని పెద్దకమ్మవారిపల్లికి చెందిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌భాస్కర్‌నాయుడు(28) ఛత్తీస్‌ఘడ్‌లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. 2006లో సీఆర్పీఫ్‌లో చేరిన విజయ్‌భాస్కర్‌నాయుడు ఈ నెల 5న ఛత్తీస్‌ఘడ్‌లో విధినిర్వహణలో ఉండగా ప్రమాదంబారిన పడ్డాడు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం గురువారం తెల్లవారుజామున గ్రామానికి చేరుకుంటుందన్నారు. 

మరిన్ని వార్తలు