హత్య కేసులో దంపతుల లొంగుబాటు

14 Aug, 2015 15:31 IST|Sakshi

ఆదిలాబాద్ : ఓ యువకుడ్ని గొంతు కోసి దారుణంగా హతమార్చిన దంపతులు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నెల 7న కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలో శ్రీనివాస్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొమిరె రమేష్, అతని భార్య విమల కలసి ఈ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది. 

అయితే వారు ఆజ్ఞాతంలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ విషయం తెలిసిన సదరు దంపతులు శుక్రవారం స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. రమేష్ భార్య విమలను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తుండడంతో అతడ్ని హత్య చేసినట్టు వారు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు