‘లక్ష్మీ’గణపతి

9 Sep, 2016 22:26 IST|Sakshi
‘లక్ష్మీ’గణపతి
మంచిర్యాల టౌన్‌ : మంచిర్యాలలోని విశ్వనాథాలయంలో వినాయకుడిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో రూ.11,11,111 కరెన్సీ నోట్లతో అలంకరించారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిలువేరు వైకుంఠం, కార్యదర్శి చందూరి సుధాకర్, కోశాధికారి గొలుసుల ముఖేశ్‌ కుమార్, యువజన సంఘం అధ్యక్షుడు ముత్యాల సుజిత్, చంద్రశేఖర్, నారాయణ, తిరుపతి, కాచం సతీశ్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు