సిద్దిపేట రూరల్: వర్షాకాలంలో ఇళ్లు, పొలాలు, బావుల వద్ద విద్యుత్తు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. జిల్లాలో ఏడాదిన్నరలో విద్యుదాఘాతాలతో రైతులు, సామాన్యులతో పాటు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగిన స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. వర్షకాలంలో దాదాపు అన్ని నేలలు తేమతో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా, ట్రాన్స్ఫార్మర్లు ఇతర పరికరాల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాప్రాయం తప్పదు. విద్యుత్ విషయంలో అధికారుల తప్పిదంతో కొన్ని సంఘటనలు జరిగితే మరికొన్ని అవగాహన లేకపోవడం వల్ల చేసుకుంటున్నాయి.
నష్టపరిహారం కొంతే..
జిల్లాలో 2015 సంవత్సరంలో 123 మంది విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఇందులో ఇద్దరు విద్యుత్తు శాఖ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా, ఇందులో సగానికి పైగా రైతులు ఉన్నారు. అదేవిధంగా 41 పశువులు మృత్యువాత పడ్డాయి. 2016 జూలై 30 వరకు 32 మంది రైతులతో పాటు సామాన్యులు మృతి చెందారు. 70 పశువులు మృత్యువాత పడ్డాయి. వీటిలో గత ఏడాది 47 మందికి ఎక్స్గ్రేషియా కింద రూ.2 లక్షల చొప్పున, 35 పశువులకు రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం అందించారు.
ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నస్టపరిహారం పెంచడంతో ఏడుగురికి రూ.4 లక్షల చొప్పున, 32 పశువులకు రూ.40 వేల చొప్పున పరిహారం అందజేశారు. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా కరెంట్షాక్కు ఎక్కువగా రైతులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్న అంశం. వారికి ఎలాంటి సూచనలు, సలహాలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రైతన్న తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే.
జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు
ఎర్తింగ్ లేకపోవడంతో...
విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఎర్తింగ్ లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాటిని ఏర్పాటు చేసినప్పుడు కాంట్రాక్టర్లు అవసరమైనంత లోతుగా గుంతలు తీయకపోవడం, నాణ్యమైన పైపులు వేయకపోవడం, ఉప్పు, బొగ్గు లాంటి ముడిపదార్ధాలు సరైన మోతాదులో వేయకపోవడంతో ఎర్తింగ్ వస్తుంటుంది. అంతేకాకుండా నాణ్యత లేకుండా ఎర్తింగ్ చేయడంతో భూమిలో తేమశాతం ఉన్నంత మాత్రమే అది పనిచేస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టర్ డబ్బాలు నాణ్యమైనవి వాడాలి. వాటిని తెరిచే ముందు జాగ్రత్తలు పాటించాలి. రైతులు విద్యుత్తు పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా లైన్మన్లకు సమాచారం ఇవ్వాలి. - పండరి నాయక్, ఏడీఈ, ట్రాన్స్కో సిద్దిపేట