ఐదు కిలోల గంజాయి పట్టివేత

28 Jul, 2016 22:12 IST|Sakshi
ఐదు కిలోల గంజాయి పట్టివేత
 
 పట్నంబజారు (గుంటూరు):  ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ నేతల ఆనందరాజు ఆదేశాల మేరకు జిల్లాలో ఎకై ్సజ్‌ అధికారులు గంజాయి అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగా గురువారం మాచర్ల ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని దుర్గి మండలం అడిగొప్పుల గ్రామానికి చెందిన సంకురాత్రి రామాంజమ్మ, ఈశ్వరమ్మలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ జి.సూర్యనారాయణ, ఎసై ్స ప్రసన్నలక్ష్మీ, సిబ్బంది షేక్‌ బాబావలి, దాసు, సుశీలరావు, శ్రీనివాసరెడ్డి పాల్గోన్నారు. 
 
 
మరిన్ని వార్తలు