రూ.50 తగ్గిన డీఏపీ ధరలు

24 Jul, 2016 17:03 IST|Sakshi

పెద్దేముల్‌: డీఏపీ ఎరువుల ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. నెలరోజుల క్రితం గోదావరి 50 కిలోల బస్తా రూ.1,303 ఉండగా, తరువాత రూ1,260కి విక్రయించారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్‌ రైతు సేవా సహకార సంఘం అధికారులు రూ.1,155కి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి రైతులు ఎరువులు ఖరీదు చేసుకోవాలన్నారు. కాగా కొన్ని గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో మాత్రం అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, రసీదులు అడగితే ఇవ్వడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు