2న వైఎస్సార్‌ వర్ధంతి

30 Aug, 2016 20:40 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: మహానేత వైఎస్సార్‌ ఏడో వర్ధంతిని సెప్టెంబర్‌ 2న గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లో, డివిజన్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించి, వైఎస్సార్‌ చిత్రపటాలు ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించాలని కోరారు.

వైఎస్సార్‌ విగ్రహాలను పూలమాలలతో అలంకరించాలని చెప్పారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, అన్నదానం, రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సెప్టెంబర్‌ 1న ఆయా డివిజన్లలో కార్యకర్తలు ఒకచోట చేరి సన్నాహక కార్యక్రమాల గురించి చర్చించాలని చెప్పారు.

 

>
మరిన్ని వార్తలు