రూ.75 లక్షల ధనలక్ష్మి

7 Oct, 2016 23:03 IST|Sakshi
రూ.75 లక్షల ధనలక్ష్మి

రాజేంద్రనగర్‌: కాటేదాన్ లోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మిగా అలంకరించారు. రూ.75 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని ముస్తాబు చేశారు. గత ఐదేళ్లుగా ఈ అలంకరణ చేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. రూ. 11 లక్షలతోప్రారంభమైన అలంకరణ ఈ ఏడాది రూ.75 లక్షలకు చేరిందన్నారు.
 

మరిన్ని వార్తలు