'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'

23 Jan, 2016 14:22 IST|Sakshi
'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'

విజయవాడ: బాధితులకు న్యాయం అందిచలేకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో శనివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం. తొమ్మిది రాష్ట్రాల్లో కేసుల పరిష్కారాల కోసం సంవత్సరాలపాటు సమయం పడుతుంది. దీనివల్ల న్యాయం కోసం ఎదురు చూసే వారిలో నిరాశ పెరుగుతుంది. బాధితులకు అండగా నిలిచే క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకం' అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

మరిన్ని వార్తలు