షాబాద్‌లో బాలుడికి డెంగీ

28 Jul, 2016 21:00 IST|Sakshi

షాబాద్‌: డెంగీ సోకి ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన ఒగ్గు రాజయ్య కుమారుడు తరుణ్‌కుమార్‌(15) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుడిని తండ్రి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలు నిర్వహించిన వైద్యులు తరుణ్‌కుమార్‌కు డెంగీతో బాధపడుతున్నట్లు నిర్దారించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గురువారం అక్కడి నుంచి నగరంలోని మలక్‌పేట్‌లో ఉన్న ఓ ప్రైవేటుకు ఆస్పత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు