యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైలన్నీ బోసిపోయాయి. కేవలం అరగంటలోనే స్వామి అమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకున్నట్లు భక్తులు తెలిపారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా పారామిలటరీ దళాలు భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు.