యాదాద్రిలో పోటెత్తిన భక్తులు

12 Jun, 2016 11:52 IST|Sakshi

యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లు దాటి బయట వరకు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

మరిన్ని వార్తలు