తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

19 Jul, 2016 07:52 IST|Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుని సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. సోమవారం 89,020 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నేడు పౌర్ణమి సందర్భంగా నేటి సాయంత్రం గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు